CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ వర్ధంతి సభలను జయప్రదం చేయండి : తుడుం దెబ్బ మండల కార్యదర్శి నరసింహ రావు

Share it:


మన్యం న్యూస్ గుండాల: (07) ఆదివాసి పోరాటయోధుడు కొమరం భీమ్ 82వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గోవింద నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో కొమరం భీమ్ వర్ధంతి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 9 తారీఖు నుండి 17వ తారీకు వరకు కొమరం భీం వర్ధంతి సభలను గ్రామ గ్రామాన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభలకు ఆదివాసి ప్రజలు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. ఆదివాసీలు ఐక్యతగా ఉంటూ ఆదివాసి  ప్రజల మనుగడ కోసం పోరాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోకాళ్ళ కన్నయ్య, మహేందర్, సత్యం తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: