* మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
* ఏటూరునాగారం కాంగ్రేస్ పార్టీ మండల బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న మరియు మండల అధ్యక్షులు చిటమట రఘు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో మండపు నర్సయ్య (60) సంవత్సరాల వయసు గల వ్యక్తి అనారోగ్యం తో హఠాన్మరణం చెందారు.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు,బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేస్తూ వారి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు.వారి యొక్క కుటుంబాన్ని పరామర్శిస్తూ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇస్తూ గుండె ధైర్యం నింపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,
యూత్ జిల్లా కార్యదర్శి ఎండీ గౌస్,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,
గ్రామ అధ్యక్షులు సోదారి పోషయ్య,మండల సోషల్ మీడియా ఇంచార్జి సోదారి హరీష్,డోంగిరి మధుబాబు,
జిమిడా రవి,దుర్గం అర్జున్,
గ్రామ ఎస్సి సెల్ అధ్యక్షులు దుర్గం తిరుపతి,దుర్గం శేఖర్,బేడిక మల్లయ్య,
కొండగొర్ల సమ్మయ్య, గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: