మన్యం న్యూస్ గుండాల: (07) ఆదివాసి హక్కుల రక్షణకై జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం పిలుపునిచ్చారు. శుక్రవారం ముత్తాపురం గ్రామంలో బహిరంగ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాద సిద్ధాంతాలను అవలంబిస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ రక్షణ నియమాకాల చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్టంతో దేశంలో ఉన్న 40 కోట్ల మంది ఆదివాసి ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు 5,6 షెడ్యూల్ 1/ 70 యాక్ట్, పెసా చట్టం, నీరు గారు పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలకు వ్యతిరేకంగా జరిగే సభను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: