CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య.

Share it:


మన్యం న్యూస్ :ములకలపల్లి: (అక్టోబర్07):

ములకలపల్లి మండలంలో వికే రామవరం గ్రామంలో పోడుదారులందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అనపరపు కనకయ్య డిమాండ్ చేశారు.పోడు సాగుదారుల సదస్సులో మాట్లాడుతూ,అనేక సంవత్సరాలుగా పోడుభూమి సాగు చేసుకుంటున్న వారికి  సిపిఎం పార్టీ అండగా ఉందని, అటవిశాఖ , ప్రభుత్వం ఎన్ని విధాలుగా పడుకో సాగుదారులపై ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా సిపిఎం పార్టీ వారికి అండగా ఉంది అని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయడంలో పాలకవర్గాలు విఫలమైనాయని,అటవిహక్కుల కమిటీ ద్వారా సర్వే చేసి భూమి పై హక్కు కల్పించాలని ఇకనైనా పోడు సాగు లబ్ధిదారులందరికీ కూడా పోడుభూమి పట్టాలు ఇవ్వాలని, ఆంక్షలు లేకుండా ఆ పట్టాలు ఇవ్వాలని, పోడు భూమి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు పొడియం వెంకటేశ్వర్లు, కుంజా భాస్కర్, రామూర్తి, బుల్లెమ్మ రమేష్.తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: