మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో విజయదశమి దేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు సందర్బంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం శుక్రవారం అన్నదానం కార్యక్రమానికి అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా వారసులు మెచ్చా రాము, మేనళ్లుడు తాటి ప్రదీప్ లు పాల్గొన్నారు. జమ్మి గూడెం గ్రామ ప్రజల పిలుపుమేరకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ మెచ్చా వారసులు ముందుగా అమ్మవారిని దర్శించుకొని కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెచ్చా ఆదేశానుసారం జమ్మి గూడెం అన్నదానం కార్యక్రమానికి విచ్చేసినట్టు తెలిపారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో నియోజక వర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, వార్డ్ మెంబర్ జగపతి, సింగుళూర్ కృష్ణ మరియు కార్యకర్తలు, అభిమానులు, యువకులు చంటి, భాగ్యరాజు, ముత్తు, నవీన్, గ్రామ మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: