మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ: వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా మన ఊరు- మన బడి పనులు పూర్తి చేయడం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ ఈఈ సుధాకర్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఎస్సీ హాస్టల్ మరమ్మత్తులు, ప్రహరీగోడ నిర్మాణం పనులను వెంటనే అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మన ఊరు -మనబడి కార్యక్రమం పనులను పరిశీలించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మనబడి పనులలో అలసత్వం వహిస్తే సంబంధిత కాంట్రాక్టర్, పాఠశాల యాజమాన్య కమిటీలపై చర్యలుంటాయన్నారు. నిబంధనల ప్రకారం త్వరితగతినగా పూర్తి చేయాలన్నారు . ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట ఏ ఈ శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు, ప్రధానోపాధ్యాయులు ఆనంద్, తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: