మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన సుమారు 10 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .
ఈ సందర్భంగా రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
అన్ని వర్గాల ప్రజలకు బి ఆర్ ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతున్నదని, ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు. శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున
బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించామన్నారు. ఆసరా పెన్షన్ రైతుల కోసం రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పేదల కోసం కళ్యాణ లక్ష్మి , షాదీముబారక్ వంటి పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు.
Post A Comment: