మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
ఏజెన్సీ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యం అని అన్నారు. మండల పరిధిలోని మలకపాడు గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించే క్రీడా ప్రాంగణాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు ఈరోజు ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ దుమ్ముగూడెం సిఐ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల క్రీడాకారులు వెలికి తీసేందుకు ఐటిడిఏ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన క్రీడా మైదానం ఏర్పాటు చేయడం జరుగుతుందని త్వరలోనే సంబంధిత పనులు వేగవంతంగా పూర్తి చేసి క్రీడామైదాన్ని అందుబాటులో చేస్తామని ఈ క్రీడా ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో ఫ్లడ్ లైట్ల వెలుగులలో క్రీడా మైదానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ సట్ల రాజు స్పోర్ట్స్ ఆఫీసర్ వీరు నాయక్ ఎస్ఐ రవికుమార్ డాక్టర్ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: