మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గురువారం తహసిల్దార్ చల్లా ప్రసాదుకు వినతి పత్రం సమర్పించిన సిపిఐఎంఎల్ ప్రజాపంధా నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005 కంటే ముందు నుండి సాగులో వున్న పోడుభూములన్నిటికీ సర్వే నిర్వహించి సాగుదారులందరికి పట్టాలివాలనీ, సర్యే చేస్తున్నక్రమంలో చిన్న చిన్నతుప్పలు వున్నపటికి సర్యేచేయాలనీ, సాగుదారుడు చనిపోతే, ఆయన వారసులకు పట్టాలు ఇప్పించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంధా పార్టీ తరుపున డిమాంఢ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. సాగుచేస్తున్న క్రమంలో ఆసుపాక, వినాయకపురం తదితర గ్రామాలలో పారెస్టువారు కందకాలు తవ్వి, మొక్కలు వేసినభూములను కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహిసీల్దార్ చల్లా ప్రసాదు కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యంయల్ ప్రజాపందా జిల్లాకార్యదర్శి గోకినేపల్లి ప్రభాకర్, మండల కార్యదర్శి కంగాల కల్లయ్య, కన్నాయిగూఢెం యంపిటిసి వాసంబుచ్చిరాజు, పివైయల్ మంఢల అద్శక్షుడు భాఢిస లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: