మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని విఅర్ఏ లు విధుల్లో చేరారు. గడచిన 80 రోజుల నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా, పే స్కేల్ వేతనం ప్రకటించాలని కోరుతూ నిరవధిక సమ్మెను వీఆర్ఏలు చేయడం జరిగింది. దానితోపాటు తహాసిల్దార్ కార్యాలయ దిగ్భంధం కూడా ఇటీవల చేయడం జరిగింది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో పినపాక మండల వీఆర్ఏలు డిప్యూటీ తహాసిల్దారుకు సమ్మె విరమణ పత్రం అందజేసి విధుల్లో చేరుతున్నామని తెలియజేశారు.
Post A Comment: