ములకలపల్లి:మన్యం న్యూస్ :(అక్టోంబర్ 04)
మండలంలోని తిమ్మంపేట గ్రామంలో భగత్ సింగ్ సెంటర్,రామాలయం సన్నిధిలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రులు ముగింపు సందర్భంగా అశ్వారావుపేట మాజి శాసన సభ్యులుతాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజకార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు చే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరి లక్ష్మీ , కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు,సీపీఐ రాష్ట్ర నాయకులు నరటి ప్రసాద్,టిఎన్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ నడిపల్లి నవీన్ కుమార్,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి,పాలకుర్తి ప్రసాద్, సోయం చిన్నారి,గాదెగోని వెంకటేష్ గాడ్,తుర్రం శ్రీను, పాలకుర్తి రవి,గౌరి నాగేశ్వరావు,డాక్టర్ వెంకటేశ్వరావు, తాండ్ర శ్రీనివాసరావు,కొండ్రు రవి, నాగరాజు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: