మన్యం న్యూస్, గుండాల ,అక్టోబర్ (23) : మండల కేంద్రంలో నవంబర్ 1న నిర్వహించే అమరవీరుల వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి సభ విజయవంతం కొరకు ప్రతి ఒక్క కార్యకర్తను కలిసి వివరిస్తామని సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న అన్నారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం ఎంతోమంది వీర కిశోరాలు ఉద్యమం కోసం పశువులు పాషారన్నారు. వారిని స్మరించుకుంటూ నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తలవి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్, రాజు, సనప కుమార్, ఈసం కృష్ణ , సింగన్న, పూనేం మంగయ్య, కోడూరి జగన్, పుష్ప రాజ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: