మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల సంపత్ అనే విలేకరి శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో పురుగుల మందు సేవించాడని తెలుసుకున్న కుటుంబీకులు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడినుండి మణుగూరులోని వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వెంటనే వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి వైద్యులు సిఫార్సు చేశారు. భద్రాచలం నుండి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి శనివారం ఉదయం తరలిస్తుండగా మార్గమధ్యంలో ములుగు సమీపంలో మరణించాడని కుటుంబాలు తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Post A Comment: