CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విహార యాత్రలో విషాదం.

Share it:


మన్యం న్యూస్ ,వాజేడు,అక్టోబర్ 23:

మండలంలో చీకుపల్లి బోగత జలపాతంలో యువకుడు మృతి చెందాడు.వాజేడు ఎస్ ఐ హరీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఉయ్యూరు గ్రామానికి చెందిన అనిల్ కృష్ణ (25) అనే యువకుడు హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడని,ఆ కంపెనీలో పని చేస్తున్న వారంత ఆదివారం సెలవు రోజు కావడంతో  ఫ్రెండ్స్ తో కలిసి ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బోగత జలపాతానికి వచ్చారు. జలపాతంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతం నీటిలో పడి   నీళ్లు తాగడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.వెంటనే గమనించిన తోటి స్నేహితులు హుటాహుటిన వాజేడు వైద్యశాలకు తరలించారు.వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. తోటి స్నేహితుడు మృతి చెందడంతో మిత్రులందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.వాజేడు ఎస్సై హరీష్ అక్కడికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించి కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Share it:

TELANGANA

Post A Comment: