- అంగన్వాడీల సమస్యల పై ఉద్యమించాలి
- *ఐసీడీఎస్ ను పటిష్టం చేయాలి.
- *తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ.
మన్యం న్యూస్ , ఏటూరునాగారం:
అంగన్వాడిలు సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని, అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయకార్యదర్శి జి పద్మ పిలుపునిచ్చారు. ఏటూరునాగారం బి ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ యూనియన్ రెండవ జిల్లామహాసభ సరోజన, పద్మారాణి అధ్యక్షత న జరిగింది. మహాసభ ప్రారంభ సూచకంగా జిల్లా అధ్యక్షులు సరోజన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ రాబోయో కాలంలో ఆ పథకాన్నీ ఎత్తి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనిఅన్నారు. కనీసవేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2017 నుండి పెండింగ్ లో ఉన్న టి ఎ డి ఎ లు ఇవ్వాలని అన్నారు.బిఎల్ఓ డ్యూటీలు ఇతర డిపార్ట్మెంట్ కు అప్పచెప్పాలని, మేము చేయలేమని అన్నారు.
ఆన్లైన్లో రిపోర్ట్స్, రాతపూర్వకంగా రిపోర్ట్స్ లలో ఒకటి మాత్రమే చేస్తామని అన్నారు. మినీ సెంటర్స్ ను జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ప్రతి మినీ కేంద్రాన్ని మెయిన్ కేంద్రంగా చేయాలి మెయిన్ టీచర్ తో సమాన జీతం ఇవ్వాలి అన్నారు.పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు ఇవ్వాలనీ అన్నారు.
అన్నిరకాల స్టాక్ ఒకేసారి వేయాలి,నాణ్యమైన కోడిగుడ్లు, ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండి దావుద్, కార్యదర్శి రత్నం రాజేందర్,బాలోజు రమేష్,కె సమ్మక్క, ప్రేమకుమారి,జమునరాని, సురమ్మ, రేణుక, వనమాల,రజిత,పార్వతీ, వెంకటరమణ, స్వరూప, భిక్షావతి, విజయలక్ష్మి, రాధిక, రమ, తో పాటు 150 మంది పాల్గొన్నారు.
*తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పద్మ.
మన్యం న్యూస్ ఏటూరునాగారం
అంగన్వాడిలు సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని, అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయకార్యదర్శి జి పద్మ పిలుపునిచ్చారు. ఏటూరునాగారం బి ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ యూనియన్ రెండవ జిల్లామహాసభ సరోజన, పద్మారాణి అధ్యక్షత న జరిగింది. మహాసభ ప్రారంభ సూచకంగా జిల్లా అధ్యక్షులు సరోజన జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ రాబోయో కాలంలో ఆ పథకాన్నీ ఎత్తి వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనిఅన్నారు. కనీసవేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
2017 నుండి పెండింగ్ లో ఉన్న టి ఎ డి ఎ లు ఇవ్వాలని అన్నారు.బిఎల్ఓ డ్యూటీలు ఇతర డిపార్ట్మెంట్ కు అప్పచెప్పాలని, మేము చేయలేమని అన్నారు.
ఆన్లైన్లో రిపోర్ట్స్, రాతపూర్వకంగా రిపోర్ట్స్ లలో ఒకటి మాత్రమే చేస్తామని అన్నారు. మినీ సెంటర్స్ ను జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ప్రతి మినీ కేంద్రాన్ని మెయిన్ కేంద్రంగా చేయాలి మెయిన్ టీచర్ తో సమాన జీతం ఇవ్వాలి అన్నారు.పెండింగ్ లో ఉన్న గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు ఇవ్వాలనీ అన్నారు.
అన్నిరకాల స్టాక్ ఒకేసారి వేయాలి,నాణ్యమైన కోడిగుడ్లు, ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండి దావుద్, కార్యదర్శి రత్నం రాజేందర్,బాలోజు రమేష్,కె సమ్మక్క, ప్రేమకుమారి,జమునరాని, సురమ్మ, రేణుక, వనమాల,రజిత,పార్వతీ, వెంకటరమణ, స్వరూప, భిక్షావతి, విజయలక్ష్మి, రాధిక, రమ, తో పాటు 150 మంది పాల్గొన్నారు.
Post A Comment: