*బతుకమ్మ పండుగ పూట విషాదం
*అత్తగారింటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లిన వ్యక్తి.
*శోకసముద్రంలో కుటుంబ సభ్యులు.
మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
బతుకమ్మ పండుగకు పూల పూలు తెచ్చేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఏటూరు నాగారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దికుంట మండలం సుల్తానాబాద్ జిల్లా కరీంనగర్ నివాసి వీర వేణి శ్రీను (28) ఏటూరు నాగారం మండల కేంద్రం లోని అత్తగారింటికి పండుగ కోసం వచ్చి బావమరిదితో పూల కోసం మండలంలోని చల్పాక మాట కుంట చెరువులో దిగి కొంత దూరం వెళ్లి తిరుగు ప్రయాణ క్రమంలో కాళ్లకు గడ్డి చుట్టుకుని ఊపిరాడక మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు.
Post A Comment: