మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 03... తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుందామని చుంచుపల్లి మండల తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చుంచుపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలలో భాగంగా బతుకమ్మని నిమజ్జనం చేసేందుకు విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో చింతలచెరువు బతుకమ్మ ఘాట్ ను సందర్శించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. బారిగేట్లు, ఫ్లడ్ లైట్, గజ ఈతగాల ఏర్పాట్లు, గ్రామపంచాయతీ సిబ్బంది నియామకం శానిటేషన్ బూస్ క్లియరెన్స్ మొదలగు పనులను పరిశీలింఛారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మలను నిమజ్జనం కోసం అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు చిన్నారులు హాజరవుతారని బతుకమ్మ ఘాట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బంది పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలి అన్నారు. చెరువులో లోతట్టు ప్రాంతాలకు భక్తులు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సకినాల రమేష్ , చుంచుపల్లి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ , ఎంపీఓ గుంటి సత్యనారాయణ , సర్పంచ్ బాణోత్ గోవిందు ,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: