మన్యం న్యూస్, అశ్వారావుపేట:అశ్వారావుపేటలో పలు చోట్ల ఆదివారం సాయంత్రం బతుకమ్మ సంబరాల్లో పాల్గొనీ ఆడపడుచులు మరియు చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడిన అశ్వారావుపేట ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్లిన ఆడపడుచులు ఎమ్మెల్యే మెచ్చా కి ఘన స్వాగతం పలికారు. చిన్నారులు సైతం వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎంఎల్ఎ మెచ్చా ని శాలువాతో సత్కరించారు కమిటీ సభ్యులు.
-మద్దిరమ్మ గుడి సెంటర్ వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
-గాంధీ బొమ్మ సెంటర్ నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
-రామాలయం వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
-శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
-జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గం లో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఎ మెచ్చా మాట్లాడుతూ ప్రజలందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మనం దసరా పండుగ అంగరంగవైభవంగా జరుపుకుంటున్నాం అని. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు అలాగే ఆయనను ఆహ్వానించి ఘన స్వాగతం పలికిన ఆత్మీయ సోదర సోదరీమణులకు జీవితాంతం రుణపడి ఉంటానని వారు చూపించిన ప్రేమ ఆప్యాయతను ఎన్నటికీ మరువనని చిన్న పిల్లలు సైతం వారి అభిమానాన్ని చాటుకుంటుంటే చాలా సంతోషంగా ఉందని సంతోషాలలోనే కాదు కష్టాల లోని అండగా ఉంటానని ఎలాంటి సమస్య ఉన్న కూడా సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, మండల నాయకులు, వార్డ్ మెంబర్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: