మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పండువారిగూడెం గ్రామం లో మంగళవారం పోడు భూముల సర్వే లో అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. అనంతరం పోడు రైతులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ గిరిజనుల అభివృద్ధి విషయంలో గాని, అన్ని రంగాలలో గిరిజనులు ముందుండాలని ఆలోచించే ఏకైకైక ప్రభుత్వం అని బిఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సర్వే నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు పట్ల, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు పట్ల పోడు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బీట్ ఆఫీసర్, సెక్రటరీ, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, పోడు రైతులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: