మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్(18) : మండలం పరిధిలోని దామరతోగు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం ఓ ఎస్ డి సాయి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈ హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రమణమూర్తి, గుండాల సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, ఖమ్మం ప్రముఖ వైద్యులు స్వర్ణకుమారి, సాయికుమార్, సాయి భార్గవ, సాయి వంశీ, గ్రామీణ వైద్యుల జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు, గుండాల గ్రామీణ వైద్యులు టి రాము, సోలం సతీష్ , ఎండి మహమూద్, కోడూరి భాస్కర్, రాములు, బొమ్మెర రాంబాబు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: