CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన ఊరు -మనబడి తో పాఠశాలకు మహర్దశ... ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాసరెడ్డి..

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి , చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశాలకు మహర్దశ పట్టిందని ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మన ఊరు మనబడి పనుల శంకుస్థాపనలో ఆయన పాల్గొని  భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ.66 లక్షల అంచనా వ్యయంతో డైనింగ్ హాల్ ను శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎస్ఎంసి సభ్యులు  షబ్బీర్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉపతల ఏడుకొండలు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, హెచ్ఎం ఆనంద్,ఏఈ శ్రీనివాసరావు గ్రామస్తులు కేశబోయిన నరసింహారావు,  శంకర్, కిరణ్,ఆళ్లకుంట రాందాస్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: