మన్యం న్యూస్,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వార్డెన్ ప్రమీల అందిస్తున్న భోజనం గురించి పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం తినడానికి అనుకూలంగా లేదని, మీ కుటుంబంలోని పిల్లలకు మీరు ఇలాంటి భోజనమే ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి హెచ్చరించడం జరిగిందని మరలా ఇదే పునరావృతం అయిందని అసహనం వ్యక్తం చేశారు. వార్డెన్ గురించి భద్రాచలం ఐటిడిఏ డిడి తో మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సినిమా పాఠశాలకు ఇలాంటి వార్డెన్ అవసరం లేదని, వీలుంటే ఆమెను మార్చాలని ఆయనకు తెలియజేశారు. ఇదే చివరి అవకాశం అని, హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, సర్పంచ్ లు మొగల పల్లి నర్సింహరావు, నూప నాగ భూషణం,కోర్సం క్రిష్ణం రాజు,ఎంపిటిసి కాయం శేఖర్,తెరాస యూత్ నాయకులు ఆశోక్,ఆదివాసీ ఐక్య వేదిక మండల అధ్యక్షుడు తోలెం శ్రీను,తెరాస నాయకులు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: