మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు మరియు అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ వేముల భారతి కి ఇంటర్ నేషనల్ గ్లోబల్ యూనివర్సిటీ గ్రేసీ లేడీస్ అకాడమీ గౌరవ డాక్టరెట్ ప్రకటించింది. కరోనా కష్టకాలం నుండి పలు సేవాకార్యక్రమాలతో ముందుకు వెళుతు ఒక మహిళగా దిశ స్వచ్చంధ సంస్థ అధక్షురాలిగా మహిళలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తూ మరోపక్క మైనర్ బాలికల పై ఎప్పటికప్పుడు ప్రత్యేక ద్రుష్టిసారిస్తూ ప్రతి మహిళా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం లో వేముల భారతి తన సేవ కార్యక్రమాలు కనబరిచారాని తెలియజేసారు. గత సంవత్సరం హైద్రాబాద్ సింగరేణి కాలనిలో అరెళ్ల పసిపాప చైత్ర ఓ కామాందుడి చేతిలో హత్యాచారానికి గురైతే జిల్లా వ్యాప్తంగా వేముల భారతి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా నిలబడిన ఘనత భారతి సొంతమని యూనివర్ సిటీ హైద్రాబాద్ నిర్వాహకులు హెచ్,సి,ఆర్, బృందం ఆమె పేరును ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో గ్లోబల్ యూనివర్ సిటీలేడీ గ్రేస్ డాక్టరెట్ పట్ట పొందిన తొలి మహిళగా వేముల భారతి రికార్డు సాధించారు. ఈ గౌరవ పురస్కారాన్ని త్వరలో బెంగుళూరు లో ప్రముఖుల చెత అందజేయానున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసారు, భారతి మాట్లాడుతూ ఇంత గొప్ప పురస్కారం నాకు దక్కడం అదృష్టం గా భావిస్తున్నానని ఈ గుర్తింపు రావడానికి కారకులైన దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ నేషనల్ పౌండర్ బి వెంకటేశ్వరరాజు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రముఖులు రాజకీయ వేత్తలు వేముల భారతికి ప్రశంశలు తెలియజేస్తున్నారు. డాక్టరేట్ పురస్కారం ప్రకటించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: