CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నారవారిగూడెం కాలనీ గ్రామంలో పలు సమస్యలపై ఎంఎల్ఏ మెచ్చా కి వినతి పత్రం అందేజేత సమస్యలు పరిష్కరిస్తాను మీకు అండగా ఉంటా అధైర్య పడకండి -ఎమ్మెల్యే మెచ్చా

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండల పరిధిలోని నారవారిగూడెం కాలనీ గ్రామపంచాయతీ ప్రజలు సర్పంచ్ నారం రాధా సమక్షంలో బుధవారం అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని మెచ్చా స్వగృహం తాటి సుబ్బన్న గూడెంలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. 10సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించల్సిందిగా, నారావారిగూడెం కాలనీ గ్రామంలో అంగన్వాడి భవనం నిర్మించాలని, రేషన్ బియ్యం కోసం రెండు కిలో మీటర్లు కాలి నడకన వెళ్లాల్సి వస్తుందని ఇబ్బందిగా ఉందని ఈ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తానని వారికి తెలియజేశారు, అలాగే తాత్కాలిక రేషన్ షాప్ నీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నారంవారి గూడెం కాలనీ గ్రామ ప్రజలు అనేకమంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: