జూలూరుపాడు, అక్టోబర్ 19, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూమి సమస్యలను పరిష్కరించే దిశగా ఫారెస్ట్ అధికారులచే సర్వేలు నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు విధితమే. ఈ క్రమంలో జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు, బీట్ పరిధిలో గల బొజ్యా తండా గ్రామ పంచాయితీ గిరిజన పోడు సాగు రైతులు తమ పోడు భూమి సమస్య, మరియు సీతారాం ప్రాజెక్ట్ పెండింగ్ ల్యాండ్ సమస్యలపై స్థానిక రైతులు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను కలిసి వివరించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ బుధవారం ఐటీడీఏ పిఓ ను కలిసి గిరిజన పోడు సాగు రైతుల సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై ఐటీడీఏ పీఓ సానుకూలంగా స్పందించారని, పోడు సాగు రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపినట్లు బోజ్యా తండా గ్రామపంచాయతీ సర్పంచ్ లావుడ్యా కిసాన్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన పోడు సాగు రైతులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: