CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్తగూడెం మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా

Share it:


మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17.. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నా నని హైదరాబాదు లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల లాగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. స్థానికుడుగా తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ప్రజల కోసం తాను నిత్యం కష్టపడుతూనే ఉంటానని నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్ళని ఆయన అన్నారు. కొత్తగూడెం పట్టణ ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రత్యేక జీవోని తీసుకురావడంతో పాటు రోడ్లు డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, పాఠశాలల మరమ్మతులు, కొత్తగూడెం మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా పని చేస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా నిత్యం కృషి చేస్తున్న అన్నారు. రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం లో ప్రధానంగా పోడు భూముల సమస్యతో పాటు తాగునీరు ,విద్యుత్, తదితర సమస్యలను పరిష్కరించామన్నారు. పలు కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ కాపులు సీతాలక్ష్మి ,వైస్చైర్మన్ దామోదర్, వార్డు కౌన్సిలర్ లు మాచర్ల రాజకుమారి, బండి నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, వివిధ వార్డు కౌన్సిలర్ లు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: