మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండల పరిధిలోని పేటమాలపల్లిలో ఉన్నటువంటి భూముల గురించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతుల ఆధ్వ్యర్యంలో సోమవారం పేటమాలపల్లి లోని 70 మంది రైతులు జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్సడే లో 911 సర్వే నెంబర్ లో గల భూములు అటవీ భూములు కాదు, తరతరాలుగా తాత ముత్తాతలా నుండి సేద్యం చేస్కుంటున్నాం అవి అసైన్డ్ భూములు అని తగిన ఆధారాలను చూపి దయచేసి సమష్యను పరిష్కారం చూపాలని తెలియపరచటం జరిగిందనీ వారు తెలిపారు. రైతులు సమస్యలు విన్న కలెక్టర్ ఉన్నతదికారులు కు గ్రామస్తుల భూ సమస్య పరిష్కరించాలని ఆదేశించారని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామా పెద్దలు అల్లాడి రామారావు, బూసి పండు, అల్లాడి గోపి, మందపాటి జగదీష్, కేదాసి మంగరాజు, అల్లాడి నాగరాజు, గెద్దా బాబురావు నందికొల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: