మన్యం న్యూస్, మంగపేట.:
మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఉదయం తెల్లవారుజామున గుండగాని వెంకన్న (45) అనారోగ్యంతో మరణించగా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ దీన స్థితిని గమనించి వారి కుటుంబానికి అండగా ఉంటామని బరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడ్,బీజేపీ సీనియర్ నాయకుడు చామకురి విజయరావు,బూత్ అధ్యక్షులు బూర సుధాకర్, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, చామకురి పుల్లయ్య, బతిని రాజు,గుండగాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: