మన్యం న్యూస్,పినపాక:
తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదారులందరికీ పట్టాలను అందజేయాలని ఉద్దేశంతో పోడు భూముల సర్వేను జరిపిస్తుంది. గత కొన్ని రోజుల నుండి అటవీ శాఖ అధికారులు, పంచాయతీ, పంచాయతీ సర్పంచులు, ఎఫ్ ఆర్ సి కమిటీల ఆధ్వర్యంలో పోడు భూముల సర్వే జరుగుతుంది. తాజాగా పినపాక మండలంలోని కిష్టాపురం పంచాయతీలోని పోడు భూముల సర్వేలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, సర్పంచ్ సుతారి సుశీల, ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్, కిష్టాపురం గ్రామ అధ్యక్షుడు ఉండం బాబురావు, పోడుసాగుదారులు పాల్గొన్నారు.
Post A Comment: