CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలను సందర్శించిన సర్పంచుల సంఘం అధ్యక్షులు సర్పంచ్ నారం రాజశేఖర్

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండల పరిధిలోని మల్లాయి గూడెం గ్రామపంచాయతీ పాఠశాలను అశ్వరావుపేట మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, మల్లాయి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నారం రాజశేఖర్ సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థులను పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల చదువు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉన్న పలు సమస్యలను ఉపాధ్యాయులు సర్పంచ్ నారం రాజశేఖర్ కి తెలియజేశారు, త్వరలోనే సమస్యలని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సర్పంచ్ నారం రాజశేఖర్ హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో సర్పంచ్ నారం రాజశేఖర్ ముచ్చటించారు. విద్యార్థులకు భవిష్యత్ పై సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు కాంతారావు, వసంత రావు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: