- మండల వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న పోడు భూమి హక్కుపత్రల సర్వేలు.
- కన్నాగూడెం,కల్వలనాగారం గ్రామంలో జరుగుతున్న సర్వేలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాళికా,ఎంపీడిఓ శ్రీనువాస్
మన్యం న్యూస్ కరకగూడెం: మండల వ్యాప్తంగా కొనసాగుతున్న పోడు భూముల హక్కు పత్రల సర్వే.ఈ సర్వేలో భాగంగా కన్నాయిగూడెం గ్రామపంచాయతిలో జరిగే పోడు సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అదేశాలమెరకు కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా,ఎంపీడిఓ శ్రీనువాస్,స్థానిక సర్పంచ్ భూక్య.భాగ్యలక్మీ కన్నాయిగూడెం,కల్వలనాగారం గ్రామాలలో జరుగుతున్న పోడు సర్వేలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాళికా మాట్లాడుతూ పోడు భూముల సర్వే అధికారులు,ఎప్అర్ సి కమిటీ పారదర్శకంగా నిర్వహించిన పోడు సాగు దారులకు న్యాయం చెయ్యాలని అన్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పోడు భూముల సర్వే నిర్వహిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా.సత్యనారాయణ,కరకగూడెం ఉపసర్పంచ్ రావుల. రవి,గోట్టెముక్కల.ఉప్పల్ రెడ్డి, భూక్య.అర్జున్,నరేష్,శేఖర్,ఫారెస్ట్ బీట్ అధికారి.శ్యామ్,గ్రామపంచాయతి సెక్రటరీ తరుణ్,ఎప్అర్ సి కమిటి చైర్మెన్ సంపత్,బిఅర్ఎస్ పార్టీ యువజన నాయకులు కటుక్వజుల.వేణు,గుమ్మడివెల్లి.ప్రసాద్,కటకం.లేలిన్,కటుక్వజుల.దీలిప్,కొమరం.కిరణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: