మన్యం న్యూస్,పినపాక:
ప్రతి పోడుసాగుదారుడికి పోడుపట్టా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. గురువారం మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పోడుభూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లారన్నారు. పోడుభూములకు పట్టాలు మంజూరు చేయాలని, తద్వారా పోడు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి మూలంగానే రాష్ట్ర వ్యాప్తంగా పోడుభూములకు సర్వే జరుగుతుందన్నారు. పోడు రైతులకు కూడా రైతుబంధు పధకం అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, రైతు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, బత్తుల వెంకటరెడ్డి, పోలిశెట్టి సత్తిబాబు, ఎంపీటీసీలు కాయం శేఖర్, పోలిశెట్టి హరీష్, సర్పంచ్లు సుతారి సుశీల, మొగిలిపల్లి నర్సింహారావు, సొసైటీ డైరెక్టర్ పూనెం నర్సింహారావు, ఉండం బాబూరావు, నరేష్, లక్ష్మయ్య, పోతురాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: