CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అశ్వారావుపేట, గుర్రాల చెరువు, వినాయకపురం, నారాయణపురం, గుమ్మడివల్లి, బచ్చువారి గూడెం, తిరుమలకుంట, కొత్త మామిళ్లవారిగూడెం, ఊసిర్లగూడెం తదితర గ్రామాలను సందర్శించారు. అశ్వారావుపేటలో పసుపులేటి ఆదినారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. గుర్రాల చెరువులో కలసాల దుర్గయ్య, ఆళ్ల పుల్లయ్య, ఆత్మకూరి పాలారావు కుటుంబాలను పరామర్శించారు. వినాయకపురంలో నరాల శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.నారాయణపురంలో జెడ్పీటీసీ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాం పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. గుమ్మడివల్లిలో సీతయ్య, సాయబాజరు కుటుంబాలను పరామర్శించారు. బచ్చువారిగూడెంలో అచ్చెఫణి కుటుంబాన్ని పరామర్శించారు. తిరుమలకుటంలో పానుగంటి వీరభద్రం, డాభా భద్రం కుటుంబాలను పరామర్శించారు. కొత్తమామిళ్లవారిగూడెంలో బొడపాటి సత్యనారాయణ, రేగళ్ళ రవి కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆర్థికసాయాలను అందజేశారు. ఆపదలో అండగా ఉంటాననే భరోసాను ప్రతి ఒక్కరిలో కలిగేలా చేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: