మన్యం న్యూస్ , ములుగు:
మన ఆరోగ్యం మన చేతుల్లో నే ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేర్ ఇండియా, యూనిసెఫ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సబ్బుతో కడిగే విధానం,మన ఆరోగ్యం మన చేతుల్లో,చేతుల పరిశుభ్రత విధానంపై వాల్ పోస్టర్ లను కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను తాకేముందు,మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కుంటే ప్రతి వ్యక్తికి 60 శాతం రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చని, దీనివల్ల హాస్పిటల్ ఖర్చు తగ్గించుకొని ఆర్థికంగా లాభం చేకూరుతుందని అన్నారు.
సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడిగే ఏడు పద్ధతులను
సంస్థ వాల్ పోస్టర్ల రూపంలో జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.జిల్లాలోని అంగన్వాడి సెంటర్లలో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమం అదనపు కలెక్టర్ రెవిన్యూ వై వి గణేష్,
డిఆర్ఓ రమాదేవి,డిడబ్ల్యు ఓ.ప్రేమలత,లోకేర్ ఇండియా కార్యకర్త ఆర్ వెంకటగిరి,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: