మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 27 :ట్రాన్స్ పార్మ కు మరమ్మత్తులు చేయాలని రావికంపాడు గ్రామ రైతులు డిమాండ్ చేశారు.గురువారం గ్రామ శివారులోని రైతుల పొలాలలో గల ట్రాన్స్ పార్మర్ వద్ద రైతులు నిలబడి నిరసనని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ....ట్రాన్స్ పార్మర్ 25 రోజుల క్రితం మరమ్మతులకు గురైనా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. ట్రాన్స్ పార్మర్ పరిధిలో గల ఐదు బోరు మోటర్ల క్రింద గల 30 ఎకరాలలో వరి, మిరప తోటలు ఎండిపోతున్నాయని, రైతులు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తీరు మారకపోతే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మద్దిరాల కృష్ణార్జునరావు, అబ్బూరి వెంకటేశ్వరరావు, నిజాంపట్నం రామారావు రంగిశెట్టి రాము, ఒండ్రుమెట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్ పార్మ కు మరమ్మత్తులు చేయండి...
మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 27 :ట్రాన్స్ పార్మ కు మరమ్మత్తులు చేయాలని రావికంపాడు గ్రామ రైతులు డిమాండ్ చేశారు.గురువారం గ్రామ శివారులోని రైతుల పొలాలలో గల ట్రాన్స్ పార్మర్ వద్ద రైతులు నిలబడి నిరసనని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ....ట్రాన్స్ పార్మర్ 25 రోజుల క్రితం మరమ్మతులకు గురైనా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. ట్రాన్స్ పార్మర్ పరిధిలో గల ఐదు బోరు మోటర్ల క్రింద గల 30 ఎకరాలలో వరి, మిరప తోటలు ఎండిపోతున్నాయని, రైతులు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తీరు మారకపోతే, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మద్దిరాల కృష్ణార్జునరావు, అబ్బూరి వెంకటేశ్వరరావు, నిజాంపట్నం రామారావు రంగిశెట్టి రాము, ఒండ్రుమెట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: