CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి... తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కాకా మహేష్ దొర...

Share it:


మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 26 : పత్తి కొనుగోలు కేంద్రం( సీసీఐ )ను ఏర్పాటు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కాకా మహేష్ దొర డిమాండ్ చేశారు.బుధవారం డిప్యూటీ తహసిల్దార్  ఎల్ ప్రసన్న కు డిమాండ్లతో కూడిన వినతిని ఆదివాసి సంఘాలతో కలిసి ఆయన సమర్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చండ్రుగొండలో నిర్మించిన వ్యవసాయశాఖ గోదములను ఉపయోగంలోకి తీసుకురావాలని, స్థానిక రైతులు పండించిన పంటలు గోదములలో నిల్వ చేసుకునేలా చూడాలన్నారు. చండ్రుగొండ సీసీఐ కేంద్రం  ఏర్పాటు చేయడం వల్ల చుట్టుప్రక్కల మండలాలైన ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి రైతులు ఇక్కడికి వచ్చి పత్తిని విక్రయించుకునే విసులుబాటు, సౌలభ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ అశ్వరావుపేట నియోజకవర్గ  డివిజన్ కన్వీనర్  కుంజా వెంకటేష్ దొర, జై ఆదివాసి యువశక్తి జిల్లా అధ్యక్షులు బొర్రా సురేష్ దొర, మల్లం కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: