CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిసిరోడ్డు నిర్మాణానికి భూమిపూజ...

Share it:


 మన్యం న్యూస్, చండ్రుగొండ,  అక్టోబర్ 27 : పంచాయతీ అభివృద్దే తన లక్ష్యమని సర్పంచ్ బాబురావు అన్నారు. గురువారం పంచాయతీలో  గల ఉత్తరపొంటి కాలనీకి అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు( సిడిపి) నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పంచాయితీలో మౌలిక సదుపాయాల కల్పన అంతిమ లక్ష్యమన్నారు. ప్రధానంగా రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని ఆవాస గ్రామాలకు రోడ్లు వేయించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తునన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు ధారా వెంకటేశ్వర్లు (బాబు),లంకా విజయలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: