బడుగు బలహీన వర్గాల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం. -పినపాక నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్....
-గ్రామ ఎస్సీ సెల్ కమిటీ ఎన్నిక
బూర్గంపాడు మన్యం న్యూస్ అక్టోబర్ 27:
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో బూర్గంపహాడ్ బిఆర్ఎస్ పార్టీ మండల ఎస్సీ సెల్ మండల అద్యక్షుడు వలదాసు సాలయ్య అధ్యక్షతన బూర్గంపాడు గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ కమిటీ ఎన్నిక సందర్భంగా పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసే దీశగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని. దానిలో భాగంగానే ప్రభుత్వ పథకాలు ప్రకటించి అమలు చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బూర్గంపహాడ్ గ్రామ అధ్యక్షునిగా మందా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కుమ్మరి పల్లి నాగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దాసరి కాంతారావు, ఏస్.సి పట్టణ నాయకులు కోట రమేష్, కేసుపాక మహేశ్, రమేష్, బొందయ్య, ఇసంపల్లి వేంకటేశ్వర్లు, గంగ పూరి శేఖర్, కెసుపాక సంపత్ , మండల విద్యార్థి సంఘం నాయకులు బర్ల ప్రవీణ్ కుమార్, డేగల నవీన్, తోకల రవి ప్రసాద్, వేణు, సాయి రామ్, కామేశ్వర రావు, బర్ల వంశీ,బుయ్యన వంశీ, విజయ్,నాగరాజు, కొప్పుల రాగవులు, పున్నo, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: