బూర్గంపాడు, మన్యం న్యూస్, అక్టోబర్ 27: సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయొద్దని,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సర్వేలకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బూర్గంపాడు మండలంలో తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాహాసిల్దారు గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరరావు, నాయకులు వైయస్ రెడ్డి ,సత్యనారాయణ, వేములపల్లి దుర్గారావు,బర్ల రామకృష్ణ ,ఆర్.లక్ష్మి, మీనాక్షి, రవి,లక్ష్మణ్ ,సీత ,రోహిత్, వహీద్ పాషా,రఫీ,జీనత్ ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: