CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్న కేసీఆర్.. కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్..

Share it:


మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 7) దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కీలకపాత్ర పోషించనున్నారని, వైరా శాసనసభ్యులు రాములు నాయక్  అన్నారు. శుక్రవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టి కెసిఆర్ తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక వినూత్నమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు కెసిఆర్ అని కొనియాడారు. దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్న తరుణంలో తెలంగాణ ఖ్యాతిని దేశ నలమూలల వ్యాప్తి చేసేందుకు టిఆర్ఎస్ పార్టీని, (బిఆర్ఎస్) గా నామకరణం చేసి జాతీయ పార్టీగా విజయదశమి శుభదినాన ప్రకటించడం మనం హర్షించదగ్గ విషయం అన్నారు. కెసిఆర్ ఆశయాలకి అనుగుణంగా ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం కృషి చేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న జాతీయ నేతలందరూ భారత రాష్ట్ర సమితి తో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వేల్పుల నరసింహారావు, నున్న రంగారావు, బొజ్యా తండా సర్పంచ్ లావుడియా కిసాన్ లాల్, రామిశెట్టి రాంబాబు, రామిశెట్టి నాగేశ్వరరావు, దొండపాటి వాసు, మాసినేని సత్యం, షేక్ సుభాని, మోదుగు రామకృష్ణ, పనితి వెంకటేశ్వర్లు, చాపల మడుగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: