CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాగులో ఉన్న పోడు భూములన్నింటికి హక్కు పత్రాలివ్వాలి. -పాత అటవీ హక్కుల కమిటీలను కొనసాగించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.. పోతినేని సుదర్శన్

Share it:

 


సాగులో ఉన్న పోడు భూములన్నింటికి హక్కు పత్రాలివ్వాలి.

-పాత అటవీ హక్కుల కమిటీలను కొనసాగించాలి.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.. పోతినేని సుదర్శన్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07 ..అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగుదారులందరికి చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని ,గతంలో వేసిన అటవీ హక్కుల కమిటీలను కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచికంటిభవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గతంలో వేసిన అటవీ హక్కుల కమిటీలను రద్దుచేయవద్దని అన్నారు. శాటిలైట్ మ్యాపు ల పేరుతో గిరిజనుల ను వేధిస్తున్నారని, గ్రామ కమిటీ సిఫార్సు చేసిన ప్రతి దరఖాస్తు దారునికి హక్కుపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా లో 83, 363 ధరఖాస్తులు వచ్చాయన్నారు. 3,93,000ఎకరాల భూముల కు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో భూముల సర్వే చేయాలని, పంచాయతీ రాజ్ అధికారులకు అవగాహన లేనందున తప్పులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. అదేవిదంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ , హక్కు పత్రాలు ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జిల్లా లో ఫారెస్ట్ అధికారులు అశ్వారావుపేట నియోజకవర్గం లో గిరిజనుల ను వేధిస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం సాగుచేస్తున్న భూముల కు పట్టాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ,ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతి,బాలనర్సారెడ్డి,కె.బ్రహ్మచారి,కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మల వెంకన్న,బి.చిరంజీవి,ఎస్ ఏ నబి, దొడ్డ రవి, భూక్యా రమేష్,మర్మం చంద్రయ్య, చిలకమ్మ యాసా నరేష్,ఈర్ల రమేష్,, కొండబోయిన వెంకటేశ్వర్లు, మోరంపుడి శ్రీనివాసరావు, సరియం కోటేశ్వరరావు, ఉప్పనపల్లి నాగేశ్వరరావు, రాములు, బత్తుల వెంకటేశ్వర్లు, ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: