మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07.. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగే మహాసభలను 14వ తేదీన జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యదర్శి వై. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ మహాసభల జయప్రదం కోరుతూ కొత్తగూడెం పట్టణంలో కూలీ లైన్ ఏరియాలో 23 వ వార్డు, 33, 34, 35, 36, 24 వార్డుల పరిధిలో సిపిఐ ముఖ్య నాయకుల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం, పేద ప్రజల ముక్తి కోసం ఆనాడు దేశ సంపూర్ణ స్వతంత్రం కోసం, ఈనాడు సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, రైతులు, కార్మికులు కర్షకులు, పేద ప్రజల అభ్యున్నత కోసం కమ్యూనిస్టు పార్టీ అధికారం ఉన్న లేకున్నా దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం ఉద్యమిస్తుందని చెప్పారు. కేంద్రంలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద దేశ విచ్చనకర ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 14న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు 25 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని, దేశంలో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముగ్గురు మాజీ ముఖ్యమంతృలు కమ్యూనిస్టు అగ్రనేతలు హాజరవుతున్నారని ఈ మహాసభలకు కమ్యూనిస్టు శ్రేణులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు వివిధ వార్డుల శాఖ కార్యదర్శులు, సీనియర్ నాయకులు మామిడిపల్లి బుచ్చి రాములు, కందుల జ్ఞానయ్య, కత్తెర రవీందర్, గడ్డం రాజయ్య, బోయిన సత్యనారాయణ, మరాటి మోహన్, మోతుకూరి శంకర్, జడల ప్రకాష్ , కూకట్ల కిషోర్, గడ్డం రాజయ్య, దాసరి జ్యోతి ,గసిగంటి మోహన్ రావు అనంతగిరి అంజయ్య, కుంట రవీందర్, బొల్లం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: