మన్యం న్యూస్, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన చిన్ని పుల్లయ్య గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందగా అతని కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పినపాక మండల కమిటీ అండగా నిలిచింది. అతని కుటుంబసభ్యులకు రూ.13,000 నగదు, 50 కేజీల బియ్యం, నూనె, కందిపప్పు, గోధుమపిండి, నిత్యవసర సరుకులు అందజేశారు. మృతుని పిల్లలు చదువుకు సహాయం అందజేస్తామని కూడ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కు వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ఏడూళ్లబయ్యారం సర్పంచ్ కోరం రజిని, వార్డు మెంబర్ ముల్లంగి వెంకటరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బూర రమేష్, నాయకులు పప్పుల వెంకటరెడ్డి, ముక్కు నాసర్రెడ్డి, సత్తిబాబు, గోపాల్, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: