మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఎంపీపీ జెడ్పిటిసి తెలిపారు మండల పరిధిలోని కాశీనగరం గ్రామపంచాయతీ సురవరం గ్రామంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిధులు నుండి విడుదలైన 4.5 లక్షలు నిధులతో నూతనంగా నిర్మించే సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కృషి చేస్తుందని ప్రతి గ్రామ పంచాయతీకి మౌలిక వసతులు కల్పన అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామం ప్రగతి బాటలో నడిచే విధంగా రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూనం కనకదుర్గ చిన్నలబెల్లి ఎంపీటీసీ తునికి సీత టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితిరాముడు పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు దామ్మెర్ల శ్రీనివాస్ రావు ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొమ్ము రంజిత్ మట్ట శేఖర్ తంత్ర పల్లి వెంకటేశ్వర్లు మునీంద్ర రామారావు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: