CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి. సీఎంపిఎఫ్ వివరాలు తెలియజేయాలి సిఐటియు డిమాండ్.

Share it:


   మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్12.. .సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు 2021 ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాల తో ఏరియార్స్ డబ్బులను తక్షణమే చెల్లించాలని,2020 ఏప్రిల్ నుంచి అప్డేట్ కావలసిన సీఎంపిఎఫ్ వివరాలు తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులందరికీ తెలియజేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం ఓసి పిఓ ఆఫీస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గత 17 నెలల నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలతో ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని, సీఎం పిఎఫ్ లెక్కలను వడ్డీతో సహా 2022 మార్చి వరకు అప్డేట్ చేసి కాంట్రాక్ట్ కార్మికులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.18 రోజుల నిరవధిక సమ్మె సందర్భంగా అయినా అగ్రిమెంటులోని విషయాలను కాంట్రాక్ట్ కార్మికులకు వివరించారు. ఎటువంటి గందరగోళ పడవలసిన అవసరం లేదని చట్టబద్ధమైన అగ్రిమెంట్ అయినందున యాజమాన్యం తప్పకుండా ఒప్పందాన్ని అమలు చేయవలసి ఉంటుందని తెలిపారు.ఐక్య పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవచ్చు అనేది సమ్మె ద్వారా రుజువైందని తెలిపారు. జేఏసీ నుంచి కొన్ని కార్మిక సంఘాలు బయటికి వెళ్లి తప్పుడు ప్రచారం చేయడంతో కాంట్రాక్ట్ కార్మికుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని,ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు.ఇప్పటికైనా వేతనాల పెరుగుదల ఒప్పందం లోని అంశాలు అమలు కోసం ఐక్యంగా కృషి చేయాలని,అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం ఓసి నిర్వాసితుల సంఘం అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్,నాయకులు నవీన్,సైదులు,సూర్యం, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: