మన్యం న్యూస్, అక్టోబర్ 23, వాజేడు :
సమాజంలో బాలల హక్కులకు రక్షణ కల్పిస్తూ, చైల్డ్ లైన్ సంస్థ వారు పిల్లల హక్కులపైన సొసైటీలో అవగాహన కల్పిస్తున్నారు. బాలల హక్కులను కాలరాస్తూన్నారని, పిల్లలు ఈవ్ టీజింగ్ గురైన, కర్మాగారాలలో పిల్లలను నిర్బంధించిన, హోటల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకున్న, బిక్షాటన చేసిన 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లయితే, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, అని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ విక్రమ్, వాజేడు మండలంలో జగన్నాధపురం గ్రామపంచాయతీ ఆవరణంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. పిల్లలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నప్పటికీ సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ కు అందించవలసిందిగా చైల్డ్ లైన్ బృందం, 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ మండల ఇంచార్జ్ జయసుధ ఆటో యూనియన్ ప్రెసిడెంట్, ఆటో డ్రైవర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: