మన్యం న్యూస్ చర్ల / దుమ్ముగూడెం ::
ఏజెన్సీ లోని వానాకాలం సీజనల్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చర్ల మండల ప్రజలకు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో డాక్టర్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సిపిఐ ఎంఎల్ ప్రజా పంత నాయకుడు కొండ చరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ చర్ల ప్రసూతి హాస్పిటల్ లో డాక్టర్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు బాలింత ఇతర రోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ బదిలీ అయి 15 రోజులు గడుస్తున్నా డాక్టర్ నియమించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని నిదర్శమని విమర్శించారు అనంతరం చర్ల ఎమ్మార్వో ధరణిబాబు కి వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మార్వో మాట్లాడుతూ ఈ సమస్యని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు చుక్కయ్య సతీష్ సాంబ రాజు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: