CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆహార దినోత్సవం సంధర్బంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలో, కోనేరు బజార్ నందు గల రేషన్ షాప్ నందు నిర్వహించిన ఆహార దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీ రామమూర్తి..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీరు పేద ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచికొని ప్రజలకి బలమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో రేషన్ షాప్ లలో ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే బియ్యంలో ఫోర్టిఫైడ్ అనే రకం గల రైస్ ను ప్రతి వంద కేజీలలో 1 కేజీ ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను కలపడం జరుగుతుందని, ఈ రైస్ లో మంచి పోషకాలు కలిగి ఉన్నాయి అని వాటిలోని  ఐరన్ రక్తహీనతతో పోరాడుతుంది, ఫోలిక్ యాసిడ్ పిండం అభివృద్ధి కోసం మరియు రక్తం ఉత్పత్తికి సహాయపడుతుందనీ, విటమిన్ బి 12 నాడి వ్యవస్థ యొక్క సాధారణ పనితీరు కోసం ఫోర్టిఫైడ్ రైస్ చాల ఉపయోగ పడుతుంది, ఈ ఒక్క రైస్ గురించి తెలవక చాలా మంది ప్రజలు ప్లాస్టిక్ బియ్యం అని భయపడుతున్నారని, అలా ఎవరు భయపడకుండా ఈ ఒక్క రైస్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ అట్టం.రమ్య, డిటి సుచిత్ర, ఆర్ఐ కృష్ణా, పద్మావతి, రేషన్ షాప్ డీలర్స్ పుల్లారావు, తేజ, బిఆర్ఎస్ నాయకులు పొకల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: