మన్యం న్యూస్ అక్టోబర్ 12 వాజేడు.
పూసూరు గ్రామంలో నూతన గిరిజన ఇసుక సొసైటీ ఏర్పాటు చేయుటకు పూసూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ బోదెబోయన సరళ, అధ్యక్షతన పీసా గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభకు హాజరైన గిరిజన ఓటర్లు ఇసుక సొసైటీ ఏర్పాటు చేయుటకు సభకు హాజరైన 112 మందికి 87 మంది కొత్త సొసైటీ ఏర్పాటు చేయుట కొరకు ఏకగ్రీవంగా చేతులెత్తి పీసా గ్రామసభ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపీడీవో విజయ ఎం పీ ఓ శ్రీకాంత్ నాయుడు, గ్రామపంచాయతీ కార్యదర్శి సురేష్, పూసురు పీసా అధ్యక్షుడు అధ్యక్షులు నల్ల బోయిన రవీందర్, ఉపాధ్యక్షులు తోలెం కుమార్, పీసా మొబైల్ వైజర్ ఇండ్ల సమ్మయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: