CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇసుక రీచ్ లు సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం న్యూస్ , ములుగు : 

ఇసుక రీచ్ లు సమర్థవంతంగా నిర్వహించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం మైనింగ్ ఏడి సంబంధిత శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక రీచ్ లు సమర్థ వంతంగా నిర్వహించాలని,వే బిల్ సూచనల ప్రకారం సమయపాలన పాటించాలని,ఇసుక లారీల ఓవర్ లోడ్ అరికట్టుటకు,రాత్రివేళ వాహనాలు రోడ్డు పక్కన పార్కింగ్ వల్ల ప్రమాదాల నియంత్రణ కొరకు లారీ ఓనర్స్ లతో అవగాహన సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.భద్రాద్రి కొత్తగూడెం నుండి వచ్చే లారీలు రాత్రి 7 గంటల వరకు ములుగు జిల్లా బార్డర్ దాటే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 

ఇసుక సొసైటీలు ఒక గ్రామానికి ఒక సొసైటీ ఉంటుందని ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లయితే గ్రామ సభ నిర్వహించి సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇసుక సొసైటీల ద్వారా గిరిజనులకు ఆదాయం చేకూరేల అధికారులు కృషి చేయాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వైవి గణేష్,పిఓ టిఎస్ఎం డిసి ఎల్లయ్య,డిపిఓ వెంకయ్య,డిడి గ్రౌండ్ వాటర్ శ్రీనివాసరావు,ఏడి ఎస్ఎల్ఆర్ సుదర్శన్, మైనింగ్ ఏడి రామాచారి, డిసిఓ సర్దార్ సింగ్,డిఐఓ బాబురావు,పెస కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: